శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ధోబి ఘాట్లో రజక సంఘం నేతల ఆధ్వర్యంలో తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు లక్షలాదిమంది పేదలకు భూములు అందించాలని తెలిపారు. ఆమె సేవలను కొనియాడారు.