పలాసపురం గ్రామంలో ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు డ్వాక్రా మహిళా సంఘం స్వయం శక్తి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో గల అన్ని వీధులు తిరుగుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదంతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ కవిత, గ్రూప్ మేనేజర్లు బి.సుజాత, సరోజినీ మరియు డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.