నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండాలని సీఐ వెంకటేశ్వరావు సూచించారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, ప్రజా శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని సూచించారు. ఈ కౌన్సెలింగ్లో ఎస్ఐ సురేశ్ బాబు, ఆయా గ్రామాల రౌడీ షీటర్లు పాల్గొన్నారు.