శ్రీ సత్యసాయి పిల్ల సోమందేపల్లిలో వినాయక శోభాయాత్ర సందర్భంగా శనివారం మధ్యాహ్నం ముస్లిం మైనార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవ్ జవాన్ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముస్లిం మతపెద్దలు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో ఒకరికొకరు సహకారం అందించుకోవాలనే ఉద్ధేశంతో తమ వంతు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు వెయ్యి మందికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు.