Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, కోలగట్ల వద్ద నెల్లూరు - ముంభై జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కోలగట్ల గ్రామానికి చెందిన కల్లూరి చంద్రశేఖర్ గా స్థానికులు గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.