ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సోమవారం ఒంగోలులో జరుగుతున్న ఒడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ షేక్ రియాజ్ ను అభినందిస్తూ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శాలువా కప్పి సన్మానం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అందుకు తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.