ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడుగు గ్రామంలో బుధవారం జరిగింది. వెల్దుర్తి మండల ప్రజలు గొట్టిపాళ్ల గ్రామానికి చెందిన ముప్పారం సురేష్ విద్యుత్తు లైన్ ఏర్పాటు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై స్థభం నుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.