దేవనకొండలో 2018లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులతో కలిసి దేవనకొండలో గురువారం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆ సంఘం నేత మునిస్వామి మాట్లాడుతూ.. 2018లో వర్షాలు లేక రైతులు పంటలు నష్టపోయారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దేవనకొండను కరవు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా పరిహారం చెల్లించి, రైతులను ఆదుకోవాలన్నారు.