భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో గురువారం ఉదయం ఏడు గంటలకు యూరియా కోసం రైతులు ఎరువుల గోదాం వద్ద క్యూ కట్టారు,యురియా ఉన్నప్పటికీ ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకొని రైతులను క్యూ లైన్ లో నిలబెట్టి యూరియా అందించే ప్రక్రియ చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,పంటలు సరిగా పండటం లేదని,వెంటనే ప్రభుత్వం స్పందించి పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు రైతులు.