శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల పరిధిలో గల మండ్లిపల్లి వద్ద శుక్రవారం కదిరి రవాణా తనిఖీ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లైసెన్సులు ఎఫ్సీ లేని ఐదు వాహనాలకు 35 వేల రూపాయలను జరిమానాగా విధించినట్టు ఆయన తెలియజేశారు. అదేవిధంగా మండ్లిపల్లి వద్ద ప్రమాదానికి గురైన వాహనాలను ఆయన పరిశీలించారు.