గుత్తిలోని ఏ డీ జే, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను శనివారం జిల్లా జడ్జి భీమ్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన కోర్టుల్లోని రికార్డులను పరిశీలించారు. సుమారు గంట పాటు కోర్టులన్నింటినీలో కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారి, న్యాయవాదులు పాల్గొన్నారు.