బాపట్ల సీఐ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్ పట్నంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో డిమాండ్ చేశారు. ఇటీవల బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో నాలుగు గంటలు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నేడు విధులను కూడా బహిష్కరించినట్లు తెలిపారు. ఇరువురిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.