అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాచెనపల్లి సమీపాన గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ కు చెందిన రాజశేఖర్, పరంధాముకు తీవ్ర గాయాలు అవ్వడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. కూడేరు నుండి అనంతపురం టౌన్ కు వస్తుండగా రాచేనపల్లి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.