డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం 11:00 గంటలకు గద్వాల పట్టణానికి చేరుకోనున్నారు. అనంతరం డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసి బహిరంగ సభలో పాల్గొంటారు.