పేదలందరికీ రేషన్ అందాలనేదే కూటమి ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు. శంకర్ అన్నారు. గార మండలం రామచంద్రపురం పంచాయతీ, జొన్నలపాడు గ్రామం, నగర పరిధి కాజీపేట, రూరల్ మండలం సింగుపురం గ్రామాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్యెల్యే గొండు. శంకర్ అందించారు. ఎన్డీయే ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. కొత్త స్మార్ట్ కార్డులలో రాష్ట్ర చిహ్నం గొప్ప విషయమన్నారు.