మంత్రాలయం:- నియోజవర్గంలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. నియోజవర్గంలోని 4 మండలాలలో శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలను ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు కౌతాళం 48.0 మీ.మీ పెద్ద కడబూరు 36.8 మీ.మీ కోసిగి 10.2 మీ.మీ మంత్రాలయం 66.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు వారు తెలిపారు.