మంత్రాలయం:టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిని నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1984 నుంచి పార్టీ కోసం కష్టపడినందుకు తనను గుర్తించి ఈ పదవిని ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ మండలంలో విజయవంతంగా చేస్తానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.