కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో శుక్రవారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే,కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెల్లటూరు సర్పంచ్ హుస్సేన్ సతీమణి మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలు చర్చించారు.