ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ కాలనీకి చెందిన పిట్ల సాయికుమార్ (28) ఈ నెల 22న కూలి పనుల నిమిత్తం ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని అన్న గణేష్ ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గురువారం ఉదయం ఖానాపూర్ చెరువులో శవంగా తేలి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.