సంగారెడ్డి జిల్లాలో గత నెల 22 నుంచి 29 వరకు జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందు రామ్ శనివారం తెలిపారు. ఈ మూల్యాంకనం సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.