Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: చంద్రగ్రహణం ఎవరైనా చూడవచ్చు, మూఢనమ్మకాలు విడాలన్న: జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి విశ్వరూపం

Giddalur, Prakasam | Sep 7, 2025
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఏర్పడబోయే చంద్రగ్రహనాన్ని ఎవరైనా వీక్షించవచ్చు అని ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి విశ్వరూపం అన్నారు. ఆదివారం పబ్లిక్ యాప్ ప్రతినిధితో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడిన ఆయన చంద్రగ్రహణంపై మాట్లాడారు. ఆదివారం రాత్రి 9:50 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. సోమవారం వేకువజామున 2 గంటలకు చంద్రగ్రహణం పూర్తవుతుందని గర్భిణీ స్త్రీలు కానీ ఇతరులు ఎవరైనా సరే చంద్రగ్రహణం వీక్షించవచ్చు అన్నారు. అరుదగా వచ్చేటువంటి దృశ్యాలను మూఢనమ్మకాలతో వీక్షించకుండా దూరం కావద్దన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us