నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వరూపంగా తగ్గింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 589.80 అడుగుల వద్ద ఉంది. దీంతో డ్యాం అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 68,581 క్యూసెక్కులు అవుట్ లో 68,581 క్యూసెక్కులుగా ఉందన్నారు .జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.