Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా విస్తృత పర్యటన పంట నష్టం ను తెలుసుకున్న కలెక్టర్

Adilabad Urban, Adilabad | Aug 26, 2025
జిల్లాలోని సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామ శివారులో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట, మొక్క జొన్న పంటలను పరిశీలించారు. దాదాపుగా 7, 8 ఎకరాలలో నష్టపోయిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు చిక్ మాన్ ప్రాజెక్ట్ నుండి వస్తున్న నీటి ప్రవహానికి గేటు లేకపోవడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరుతొందని, గేటు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అదేవిధంగా సిరికొండ మండలం ప్రాధమిక సహకార వ్యవసాయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలు, ఈ పాస్ యంత్రం, నానో యూరియా సరఫరాపై ఆరా తీశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us