ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద పిఠాపురం టౌన్ మెగా అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మెగా అభిమానులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.