కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పును ఆరోపణలను ఖండిస్తూ నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రభుత్వం ఏర్పాటుచేసి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన కేసిఆర్ ను,బిఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు