శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పులక పుట్టుగ గ్రామానికి చెందిన పి ధనరాజ్ (32) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.