హొళగుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద Y జంక్షన్, అయోధ్య నగర్, బస్టాండ్ వంటి ప్రధాన కూడళ్లలో సోమవారం సాయంత్రం ఎస్సై దిలీప్ కుమార్ గురజాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాబోయే వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ప్రజా భద్రతను కాపాడటానికి, నేరాలను అదుపు చేయడానికి ఈ నిఘా నేత్రాలు మేలు చేస్తాయని ఎస్సై తెలిపారు