అన్నమయ్య జిల్లా టీడీపీ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ పరిశీలకులకు సూచించారు. రాయచోటి పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం టీడీపీ రాజంపేట పార్లమెంటరీ పార్టీ సర్వ సభ్య సమావేశం జరిగింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి అధికారంలోకి తెచ్చిన నాయకులను విస్మరించడం తగదన్నారు.