నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, అనుమతులను మించి నిర్మించిన కట్టడాలను గుర్తించి తొలి దశలోనే నిర్మాణాలను అడ్డుకోవాలని, అక్రమ నిర్మాణాలు జరపకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు.