అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాలను పరిశీలించి పండుగ రోజు కావడంతో ప్రమాదాలలో గాయపడిన వారి తాకిడి అధికంగా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని సూచించారు. వైద్యులు ప్రత్యేక చొరవతో వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.