నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని గోరుమాను కొండ సమీప ఎంజేపీ స్కూలు, కళాశాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఏడాది 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించి సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.