అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండలం బొందలవాడకు చెందిన సాకే రాజమ్మ అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.