Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గిరి గ్రామాల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ ఆదేశాల మేరకు సోమవారం పంపిణీ చేశారు. మండలంలోని గద్యగూడ, సిమ్లిగూడ, స్వర్ణయి గూడ, నియాళిగూడ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కలిగిస్తూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని పూజించాలని ఎన్ఎస్ఎస్ లు పి.నాగబాబు వై.విజయలక్ష్మి ఎం. అనిత కుమారి లు అవగాహన కలిగిస్తూ మట్టి వినాయక పంపిణీ చేశారు.