ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి ఎస్ లత మరియు ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజావాణి అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని, అధికారులు వారి వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి...