ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో 52 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలోని విగ్రహాలను ఆయన పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఊరేగింపు నిమజ్జనం సమయాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని గణేష్ కమిటీలకు సూచించారు. పోలీసు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.