Download Now Banner

This browser does not support the video element.

జహీరాబాద్: కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్

Zahirabad, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళోజి నారాయణరావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us