హైదరాబాద్ జిల్లా:రంగారెడ్డి జిల్లా మనసురాబాద్ బిజెపి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నాసిరకం పనులు చేయించినందుకు తనను కులం పేరుతో దూషించి రౌడీలను పంపి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.