ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మంత్రి వారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు రవీంద్రను ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.