శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గణేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.