అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని లోలూరు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై కారు టైరు ఊడిపోయి రోడ్డుపై ఉన్న లోలూరు కు చెందిన జయ రాములు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.