Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆ పాఠశాలను సందర్శించిన ఆయన శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మాట్లాడారు విద్యార్థుల ప్రాణాలు తీసేలా మంచినీళ్లలో పురుగుల మందు కలిపినట్లు వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.