రాయికల్ మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, ఆలూరు,వీరాపూర్,ధర్మాజీ పెట్,తాట్లవాయి,కట్కా పూర్, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో 1 కోటి 30 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బోర్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..