అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ ను మంగళవారం జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సామ్రాజ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 212 బస్సులను మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద కేటాయించినట్లు చెప్పారు. మహిళలు ఆధార్ కార్డ్ పాన్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కోరారు.