ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం సత్య నారాయణపురం పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెత్త, పిచ్చిమొక్కలను అధికారులు, సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, స్వచ్ఛ ఆంధ్ర కోసం కృషి చేయాలని కోరారు.