సైబర్ నేరాలను అరికట్టడంలో అవగాహన ప్రధాన ఆయుధమని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన సైబర్ క్రైమ్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ వారియరు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ అందించిన టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.