Download Now Banner

This browser does not support the video element.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి - గ్రామస్తులకు సూచించిన వైద్యులు

Sullurpeta, Tirupati | Sep 12, 2025
వాతావరణం మార్పుల కారణంగా వ్యాపించే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రినేటి హాస్పిటల్ వైద్యులు సూచించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువ్వలపాలెం ఎస్టీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు హాస్పిటల్ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను సైతం ఆరోగ్యపరంగా పరీక్షించారు. పిల్లల ఎత్తు బరువులను పరిశీలించారు. పౌష్టికాహార విలువలను తెలియజేశారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us