Download Now Banner

This browser does not support the video element.

నగరంలో జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజబాబు

Eluru Urban, Eluru | Sep 7, 2025
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి . రాజబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us