Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Srikakulam, Srikakulam | Sep 8, 2025
రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. సోమవారం శ్రీకాకుళం మండలం తండేం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువులు గొప్పది సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 23 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3 వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us