అమలాపురానికి రైలు కూత వినపడేలా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అమలాపురం పర్యటనలో భాగంగా సోమవారం కాపు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటిపల్లి -నర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.