Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద సోమవారం మరో ప్రమాదం జరిగింది. ఓ లారీ టోల్ ప్లాజా బూత్ను ఢీకొంది. దీంతో టోల్ బూత్ ధ్వంసం అవ్వగా టోల్ బూత్లో ఉన్న సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఇటీవల టోల్ ప్లాజా వద్ద వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. టోల్ లైన్లు ఇరుకుగా ఉండడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.